23, డిసెంబర్ 2015, బుధవారం

ప్రపంచంలోని మొట్టమొదటి అద్దముల దేవాలయం part 2

మనం ప్రపంచంలోని మొట్టమొదటి అద్దముల దేవాలయం గురించి  మాట్లాడుకుంటున్నాం కదా! ఆ దేవాలయానికి అంత ప్రత్యేకత తెచ్చినవారు ఎవరు? ఆ దేవాలయం ఎక్కడ ఉన్నది అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఆ దేవాలయ దర్శనం చేసోద్దమా!
ఈ దేవాలయం గోపురం నుండి మన కన్నులకు పండుగ మొదలవుతుంది. ఈ క్రింది ఫోటో ఆ గోపురం లోని ఒక భాగం. 
source: Internet
గోపురం తరువాతి వంతు ముఖద్వారానిది. అది ఒక అధ్బుతం.

గడపదాటి లోపలి వెళ్ళగానే ద్వజస్థంభం కాంతులీనుతూ దర్శనం ఇస్తుంది. ఈ ధ్వజస్తంభానికి క్రింద భాగం లో వినాయకుని ముఖం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Source : internet
ధ్వజ స్థంభం వెనుకగా మన చూపులను ఆకట్టుకునే మరొక కళాఖండం ఒకటి ఉంది. మానవుని అనేక స్థాయిలు. అవును. మానవ జీవితంలో వచ్చే 11 దశలు శిల్పాలుగా మలచి ఉన్నాయి.

ఇక అమ్మవారి గర్భగుడి ద్వారానికి ఇరువైపులా నృత్య గణపతి అందంగా దర్సనం ఇస్తారు. అంతే  కాకుండా ఆ ద్వారానికి పైన ఉన్న అమ్మవారి ముఖం మనలను మంత్రం ముగ్ధులను చేస్తుంది.

ఈ ఆలయంలో ఉపఆలయములు కూడా ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ఉప ఆలయాలలో వెంకటేశ్వర స్వామి, కాళిక, గణేశ, కుమారస్వామి, శివులకు కూడా నిత్య పూజలు జరుగుతాయి. ఈ ఉపఆలయములే కాకుండా 10 పాలరాతి విగ్రహములు ఉన్నాయి. అవి జీసస్, షిరిడి సాయి, పుట్టపర్తి సాయి, రామకృష్ణ పరమ హంస, రాఘవేంద్ర స్వామి, గౌతమ బుద్ధ, గురునానక్ మొదలయిన దైవ అవధూతలకు సంబందించినవి. వీరే కాకుండా ఈ యుగపు మానవతా మూర్తి మదర్ థెరిస్సా.  వీరి  విగ్రహాలు ఒక్కొక్కటి 120 cm పరిమాణంలో ఉన్నాయి. తెలియని వారికి కూడా తేలిక అర్ధం అయ్యే విధంగా వారి వారి విగ్రహాల క్రింద వారి పేర్లు వివరాలు పొందు పరచారు. మత మరస్యానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరమా!



ఇవే కాకుండా త్రిమూర్తుల విగ్రహాలు చూడటానికి నిజంగా రెండుకళ్ళు సరిపోవు.








ఐతే ఇక్కడి ఉపాలయం లోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ లింగాన్ని ఆత్మలింగం అని పిలుస్తారు. ఆ లింగం యొక్క పీఠం కమలం ఆకారంలో ఉంటుంది. అక్కడకు వచ్చిన భక్తులు స్వయంగా తాము తెచ్చిన రోజ్ వాటర్తో అభిషేకం కుడా చేయవచ్చు. లింగ దర్శనం అయిన తరువాత ఆ శివాలయపు  ప్రత్యెక ఆకర్షణ రుద్రాక్షలు పొదిగిన గర్భాలయం. అమ్మవారికి అలంకారం ఇష్టం కనుక 3,00,000 ల అద్దముల తో  దేవాలయమును అలంకరించాము, కానీ శివునికి ఇంతకు మించి ఏదయినా చేయాలి అని అనుకున్నారేమో మన సినతంబి, 3,00,000 ల రుద్రాక్షలని నేపాల్ నుండి తెప్పించి, ఒక్కొక్క రుధ్రక్షా  మంత్రపూరితంగా ఆ గోడలో పొదిగారు. ఆ రుద్రాక్షలు  పై ఫోటో లో శివలింగం వెనుక భాగంలో నల్లగా కనిపిస్తున్న గోడను పరిశీలిస్తే కనిపిస్తాయి.
ఈ దేవాలయం లో ఒకేసారి 1500 మంది కూర్చోన వచ్చు. అంత విశాలంగా ఉంటుంది. ఐతే ఈ దేవాలయ అద్దములు అంతగా మెరిసిపోవటానికి కారణం ఆ దేవాలయంలో వారు అమర్చిన చండ్లియర్స్, మరియు వానిని నిరంతరం శుభ్రంగా ఉంచే శ్రామికులు. మీరు జీవితంలో ఎప్పుడయినా మలేషియా వెళ్ళే ఆలోచన ఉంటే తప్పని సరిగా ఈ దేవాలయ దర్శనం చేసుకోండి.
ఇన్ని విషయాలు చెప్పి ఒక్క విషయం చెప్పక పొతే నా వ్రాత అసంపూర్ణం అని నా అభిప్రాయం. దేశం కాని దేశంలో, మన దేవాలయానికి ఇంత  అపూర్వ ఖ్యాతి నందించిన శ్రీ  సినతంబి గారు నిజంగా ధన్యులు. వారి భక్తి ఈ దేవాలయం అణువణువునా ప్రతిభింబిస్తుంది.
ఈ దేవాలయం అందాలను ఈ క్రింది లింక్ లలో వీడియో ద్వారా చూడండి.

  1.  https://www.youtube.com/watch?v=KWPnZ7QbOvY
  2. https://www.youtube.com/watch?v=Ei3Zo_tVgQo
  3. https://www.youtube.com/watch?v=bn3pFJ_bo0w

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి